మర్రి చెన్నారెడ్డి 103వ జయంతి వేడుకలు

మర్రి చెన్నారెడ్డి ఓ శక్తి

– గొప్ప పరిపాలన దక్షుడు, ప్రజా నాయకుడు

– తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన నేత

– కానీ తెలంగాణ వచ్చినా, చెన్నారెడ్డి కోరుకున్న ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు.

– చెన్నారెడ్డి 103వ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి. జి. కిషన్ రెడ్డి

హైదరాబాద్: మర్రి చెన్నారెడ్డి ఒక వ్యక్తి కాదు శక్తి అని, పరిపాలనా దక్షుడు, ప్రజల హృదయాల్లో పదిలమైన స్థానం సంపాదించుకున్న ప్రజా నాయకుడని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహించి పోరాటాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకువెళ్లిన నాయకుడని ఆయన కొనియాడారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, మాజీ గవర్నర్ మర్రి చెన్నారెడ్డి 103వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మర్రి చెన్నారెడ్డి రాక్ గార్డెన్ లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. కె. లక్ష్మణ్, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెన్నారెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఒకసారి, రెండుసార్లు, మూడు సార్లు కాదు.. వారు అనేక సార్లు 69లో ఉద్యమం ప్రారంభించినప్పుడు తెలంగాణలో ప్రతి గ్రామంలో ఉద్యమం ప్రారంభమైంది. ఆయన పార్టీ పెట్టి మెజార్టీ సీట్లు గెలుపించుకున్నారు. అలాగే 77లో ఇందిరా గాంధీ ఓడిపోయినప్పుడు.. ఆంధ్రప్రదేశ్లో పార్టీని నిలబెట్టుకున్న గొప్ప నాయకత్వం ఆయనది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!