ఉద్దేశ్యపూర్వకంగా సస్పెండ్‌ చేశారు…కెటిఆర్‌

సస్పెన్షన్‌ ఏకపక్ష నిర్ణయం…..హరీష్‌ రావు

హైదరాబాద్‌, నిర్దేశం :

సూర్యాపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి సస్పెన్షన్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. జగదీశ్‌ రెడ్డిని ఈ సెషన్‌ పూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించగానే.. హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఉరిశిక్ష వేసేటప్పుడు కూడా చివరిసారిగా మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు సర్‌.. విూరు ప్రధాన ప్రతిపక్షానికి విూరు మైక్‌ ఇవ్వరా సర్‌ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. సభలో మాట్లాడేందుకు మాకు ఎందుకు అవకాశం ఇవ్వరని హరీశ్‌రావు సభాపతిని ప్రశ్నించారు.స్పీకర్‌ నిర్ణయాన్ని నిరసిస్తూ.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వచ్చారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సభ నుంచి బయటకు వచ్చిన జగదీశ్‌ రెడ్డి కేసీఆర్‌ ఛాంబర్‌లో కూర్చున్నారు. అక్కడ్నుంచి కూడా వెళ్లిపోవాలని చీఫ్‌ మార్షల్‌ జగదీశ్‌ రెడ్డికి సూచించారు. సభ నుంచి మాత్రమే సస్పెండ్‌ చేశారని బీఆర్‌ఎస్‌ సభ్యులు చీఫ్‌ మార్షల్‌కు సూచించారు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కూర్చుంటే అభ్యంతరమేంటని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.

ఉద్దేశ్యపూర్వకంగా సస్పెండ్‌ చేశారు….విూడియా పాయింట్‌ వద్ద కెటిఆర్‌ ఆరోపణ
జగదీశ్‌రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సభ నుంచి సస్పెండ్‌ చేశారని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌ తర్వాత భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ…స్పీకర్‌ పట్ల జగదీశ్‌రెడ్డి అగౌరవంగా మాట్లాడలేదు. అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో ఏవిూ మాట్లాడకపోయినా.. ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయన్ను సస్పెండ్‌ చేయడం దారుణం అన్నారు. స్పీకర్‌ పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తాను చేసిన తప్పేంటని వివరణ అడిగే అవకాశం కూడా జగదీశ్‌రెడ్డికి ఇవ్వలేదు. స్పీకర్‌ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేయాలని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆదేశించాలన్నారు. ఇదే విషయాన్ని స్పీకర్‌, మంత్రి శ్రీధర్‌బాబుకు స్పష్టంగా చెప్పాం. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని కోరాం. అయినా, పట్టించుకోకుండా నియంతృత్వ పోకడలతో సభను 5 గంటలపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులతో మాట్లాడిరచి.. జగదీశ్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్టు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకుంటారని కేటీఆర్‌ అన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »