ఊరు కుక్కల దాడిలో
చుక్కల దుప్పికి గాయాలు
కాగజ్ నగర్ : అడవి నుండి దారి తప్పి ఊరులోకి వచ్చిన చుక్కల దుప్పిని ఊర కుక్కలు వెంటాడటంతో తీవ్ర గాయాలు అయిన సంఘటన కొమురం భీం జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం కాగజ్ నగర్ మండలం నజురుల్ నగర్ విలేజ్ నంబర్ 9 గ్రామంలోకి ఒక చుక్కల దుప్పి దారి తప్పి వచ్చింది. చుక్కల దుప్పిని చూసిన ఊరు కుక్కలు దాని మీదకు ఎగబడటంతో అది తప్పించుకునే ప్రయత్నంలో పరిగెత్తి ఫెన్సింగ్ కంచ పొదల్లో చిక్కుకొంది.
తీవ్రమైన గాయాలతో అరుపులు పెడుతుండడంతో గుర్తించిన గ్రామస్తులు అటవిశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ చుక్కల దుప్పిని వాహనంలో కాగజ్ నగర్ పశు వైద్యశాలకు తీసుకు వెళ్ళారు. పశువైద్యులు విజయ్ కుమార్ వైద్య పరీక్షలు నిర్వహించి తల, గదవ భాగంలో తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం అందించారు..