హైదరాబాద్ః తెలంగాణ బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ కోర్డినేటర్ గా ఇబ్రాం శేఖర్ నియామకం అయ్యారు. ఇబ్రాం శేఖర్, ఈశ్వర్ లను తెలంగాణ బీఎస్పీ స్టేట్ కోర్డినేటర్ గా బీఎస్పీ జాతీయ అధ్యక్షులు మాయావతి నియమించారు. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ప్రకటించిన బీఎస్పీసెంట్రల్ కోర్డినేటర్ రాంజీ గౌతమ్ ఈ ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ఇబ్రాం శేఖర్, ఈశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు తెలంగాణకు ఒక కోర్డినేటర్ మాత్రమే ఉండేవారు. ఈసారి ఇద్దరిని అపాయింట్ చేస్తూ మాయావతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా ఇబ్రాం శేఖర్ మాట్లాడుతూ తనకు కల్పించిన ఈ అవకాశాన్ని బహుజనుల ఐక్యతకు, బీఎస్పీ బలోపేతానికి పూర్తి స్థాయిలో ఉపయోగిస్తానని అన్నారు. అలాగే బీఎస్పీలో ఇంత ఉన్నత అవకాశం కల్పించిన బహుజన సుప్రెమో మాయావతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు.