భార్యను హతమార్చిన భర్త

భార్యను హతమార్చిన భర్త

ములుగు, నిర్దేశం:
ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ రోడ్ వద్ద రాత్రి వివాహిత సంగారబోయిన సౌందర్య దారుణ హత్యకు గురైంది, భార్య భర్తల మధ్య నెల రోజుల నుండి గొడవలు జరుగుతుండడంతో వారం రోజుల క్రితం సౌందర్య గ్రామంలోని తల్లి గారి ఇంటికి వెళ్లిపోయింది. అయితే కొందరు పెద్దమనుషులు సర్దిచెప్పి లక్ష్మయ్య ఇంటికి తీసుకువచ్చి భార్య భర్తలు ఇద్దరికి నచ్చ చెప్పారు , డిగ్రీ పరీక్షలు జరుగుతున్న క్రమంలో. సౌందర్య కుమారుడు అజయ్ హనుమకొండకు వెళ్ళాడు, ఈ క్రమంలో సౌందర్య , లక్ష్మయ్యకు మధ్య గొడవ జరిగింది, బుధవారం ఉదయం నుంచి వారి కిరణా షాపు మూసి ఉండడంగా లక్ష్మయ్య సౌందర్య ఇద్దరు కనిపించలేదు, పరీక్షల అనంతరం అజయ్ బుధవారం రాత్రి ఇంటికి చేరుకోగా. ఇంటికి గడియ పెట్టి ఉంది. తలుపు తీసి చూసేసరికి తల్లి సౌందర్య చనిపోయి కనిపించింది, దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు, ఘటన స్థలానికి సిఐ,ఎస్ఐలు చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, కాగా భార్యపై అనుమానంతో కుమారు ఇంట్లో లేని సమయంలో లక్ష్మీ హత్య చేసి పారిపోయాడని గ్రామస్తులు చెబుతున్నారు

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »