మనస్తాపంతో బాలిక ఆత్మహత్య
నిజామాబాద్, జూన్ 8 : నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం శివతాండలో విషాదం నెలకొంది. దొంగతనం నింద భరించలేక ఉరి వేసుకుని వందన అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఫోన్ పౌచ్ లోని 600 దొంగిలించిందని వందన పై ఇంటిపక్క వ్యక్తుల దొంగతనం ఆరోపణలు చేసారు. వందన తన తల్లితో ఫోన్ మాట్లాడేందుకు పక్కింటి వ్యక్తి ఫోన్ తీసుకుంది. ఫోన్ పౌచ్ లో ఉన్న 600 రూపాయలు దొంగిలించిందని ప్రవీణ్ తో పాటు అతని తల్లి బులి భాయ్ ఆరోనించారు. చేయని తప్పుకు నింద వేశారని బాలిక మనస్తాపం చెందింది. దాంతో వందన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య కు ప్రేరేపించిన ఇద్దరు వ్యక్తుల పై పోలీసులు కేసు నమోదు చేసారు.