Take a fresh look at your lifestyle.

ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి

0 13

ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి

నిర్దేశం, గడ్చిరోలి:
పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్, చోటు చేసుకుంది. ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటన గడ్చిరోలి జిల్లా కేలామారక అటవీ ప్రాంతంలో జరిగింది. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందిన నలుగురు ముఖ్య నాయకులు మృతి చెందినట్లు సమాచారం. వారిని డీవీసీ సభ్యు లు వర్గీష్‌, మంగాతు, ప్లా టూన్‌ సభ్యులు కురుసం రాజు, వెంకటేశ్‌గా గుర్తించారు.

ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. మృతు ల్లో ఇద్దరిపై పోలీసులు శాఖ గతంలో భారీ రివార్డు ప్రక టించింది.

వారిపై రూ.36 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నదని వెల్లడించారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking