మెడికల్ కాలేజీ భవనాలకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి
ఖమ్మం, నిర్దేశం:
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో మెడికల్ కళాశాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో మల్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాల ద్వారా పేదలకు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం . కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్యానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని అన్నారు.
పది సంవత్సరాలు బిఆర్ ఎస్ ప్రభుత్వం వైద్య రంగానికి 5950 కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాది లో 11482 కోట్లు ఖర్చు చేసింది. 90 లక్షల కుటుంబాల కు 10 లక్షల వరకూ లబ్ధి చేకూర్చి వైద్యం అందించాము . గత ప్రభుత్వం గాలికి వదిలేస్తే రాజీవ్ ఆరోగ్య శ్రీ పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ చేస్తున్నామని అన్నారు.
రాష్ట్రం లో బిర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిన వైద్య రంగానాని గాడిన పెడుతున్నాము. బిఆర్ఎస్ ప్రభుత్వం లో నిర్లక్ష్యానిక గురైన విద్యా రంగానికి ప్రత్యేకం గా నిధులు కేటాయించాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటేడ్ పాఠశాలల నిర్మాణం జరుగుతోంది. రాష్ట్రం లో రైతాంగానికి అండగా నిలిచి రుణమాఫీ చేశాము. నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందజేస్తున్నాము. ఖమ్మం జిల్లా లో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తున్నాం. 9 వేల కోట్లుతో రాజీవ్ యువ వికాసంతో యువత నిరుద్యోగులను ఆదుకుంటున్నామని అన్నారు.