నాంపల్లిలో అగ్నిప్రమాదం
తొమ్మిది మంది మృతి
నిర్దేశం, హైదరాబాద్ :
హైదరాబాద్ నగరం నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరిగింది. అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం పెను విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై గవర్నర్ తమిళ్ సై, సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు ఐదు లక్షల చొప్పున పరిహరం ప్రకటించింది ప్రభుత్వం.
అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం తెలియగానే హుటహుటిన సంఘటన స్థలానికి చేరుకుని 21 మందిని ఫైర్ రెస్క్కూ టీం వారి ప్రాణాలు రక్షించారు. మూడు, నాలుగు అంతస్థుల్లో ఉన్న వారు గాయాలపాలయ్యారని, వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.