ఈడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా

లిక్కర్ కేసులో కీలక మలుపు..

ఈడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా

ఢిల్లీ : 2015 నుండి ఈడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కొనసాగుతున్న నితీష్ రాణా శనివారం రాజీనామా చేశారు. కేంద్ర పెద్దల ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేసినట్టు సమాచారం.

ఇప్పటికే ఈడి కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో పని చేస్తుందనే ఆరోపణలు వస్తున్న పరిస్థితులలో ఈడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కొనసాగుతున్న నితీష్ రాణా రాజీనామా చేయడం చర్చనీయంషంగా మారింది.

ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామాతో…

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

2015 నుంచి ఈడీకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్న రాణా.. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, అతని కుటుంబం, టీఎంసీ నాయకుడు అభిషేక్ బెనర్జీ, రాబర్ట్ లతో సహా అనేక మందికి సంబంధించిన కేసులలో ఫెడరల్ ఏజెన్సీ తరపున ప్రాతినిధ్యం వహించారు.

లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ లపై జమ్మూ కాశ్మీర్ టెర్రర్ ఫైండింగ్ కేసు మరియు హఫీజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్ వంటి ఉగ్రవాదులపై కేసుల వంటి విషయాలలోను రాణా ఏజెన్సీకి ప్రాతినిధ్యం వహించారు.

ఎయిర్ ఇండియా స్కామ్, విజయ్ మాల్యా, నీవర్ మోడీ, మెహుల్ చోక్సీ, భూషణ్ పవర్ అండ్ స్టీల్, రాన్ బాక్సీ రెలిగేర్ మోసం, స్టెర్లింగ్ బయోటెక్ స్కాం, పశ్చిమ బెంగాల్ పశువులపై మనీలాండరింగ్ కేసులు వంటి హై ప్రొఫైల్ కేసుల్లోనూ రాణా ఏజెన్సీకి ప్రాతినిధ్యం వహించి, గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ “ లీగల్ పవర్ లిస్ట్ ఆఫ్ 2020” లోనూ రాణా కి చోటు దక్కింది

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!