రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి సైబర్ నేరాలు : డీజీపీ అంజనీ కుమార్

రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి సైబర్ నేరాలు
: డీజీపీ అంజనీ కుమార్

నిర్దేశం, హైదరాబాద్ : రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు డీజీపీ అంజనీ కుమార్. విదేశాలలో ఉండి నేరగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు ఆయన. సైబర్ నేరగాళ్లు అభివృద్ధి చెందుతున్న తెలంగాణా స్టేట్ దృష్టి పెట్టారన్నారు డీజీపీ. సైబర్ నేరాలు అరికట్టాలంటే పోలీసులు మరింత దృష్టి కేంద్రకరించాల్సిన అవసరం ఉందన్నారు ఆయన.

సైబర్ నేరాలు చేదించడానికి లా ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ( CISO) ఎంతగానో దోహదపడుతుందన్నారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. దేశంలోనే మొదటి లా ఎన్ఫోర్స్మెంట్ CISCO కౌన్సిల్ ఉందన్నారు. నష్టపోయిన బాధితులకు న్యాయం చెయ్యడం కోసం కౌన్సిల్ ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరాలు జరిగితే 1930కి కాల్ చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. సైబర్ క్రైమ్ సెక్యురిటి కోసమే, డిజిటల్ సెక్యూర్ కోసమే ఈ కౌన్సిల్ పని చేస్తుందన్నారు ఆయన. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో ఇండియాలోనే మొదటి లా ఎన్ఫోర్స్ మెంట్ సీఐఎస్ఓ కౌన్సిల్ సమావేశం అన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో ఐటి ప్రిన్సిపాల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, ఐటి కంపెనిస్ సీఈఓస్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు..

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!