బల్కంపేట ఆలయంలో
ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం నాడు బల్కంపేట అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు. ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. సీఎం కెసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె రాజశ్యామల పూజ నిర్వహించారు. అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు.
కవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి జన్మదినోత్సవ సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మలయల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నాను. బల్కంపేట అమ్మవారి ఆలయం రోజురోజు అభివృద్ధి చెందుతుంది. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.