మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమ వ్యవహారాలపై విచారణ

రామోజీరావు,  శైలజా కిరణ్‌లను విచారిస్తున్న సీఐడీ

◆ వందమంది అధికారులతో హడావుడి

హైదరాబాద్, ఏప్రిల్ 3 : సమాజంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను ఈనాడు పేపర్ తో శాసించిన రామోజీరావు విచారణ ఎదుర్కొవడం ఎవరు ఊహించలేని నిజం. టీడీపీ కి అనుకూలంగా, వైఎస్ ఆర్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా కథనాలు ఇవ్వడంతోనే ఈ సీఐడీ విచారణలంటున్నారు విశ్లేషకులు. వృద్దాప్యంలో కేసుల చుట్టూ తిరుగడం రామోజీరావు మానసికంగా బాధ పడుతుండచ్చు.. కానీ.. చట్టానికి ఎవరు చుట్టం కారనే విషయంను జగన్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఉంది. 

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అక్రమ వ్యవహారాలకు సంబంధించిన కేసులో సంస్థ చైర్మన్‌ చెరుకూరి రామోజీరావు, ఎండీ చెరుకూరి శైలజా కిరణ్‌లను ఏపీ సీఐడీ విచారిస్తోంది. ఈనాడు దినపత్రిక విషయంలో ప్రభుత్వం వేధింపులు చేయడాన్ని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది.

అసలేం జరిగింది.?

హైదరాబాద్‌లోని శైలజాకిరణ్‌ నివాసంలో సోమవారం ఆమెతో పాటు రామోజీరావును సీఐడీ విచారిస్తోంది. చిట్‌ఫండ్‌ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజతోపాటు మా­ర్గ­దర్శి చిట్‌ఫండ్స్‌ మేనేజర్లపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే.

ఇప్పటికే నలుగురు అరెస్ట్

దర్యాప్తులో భాగంగా రామోజీరావు, శైలజను విచారించాల్సిన అవసరం ఉందని నిర్ధారించింది సీఐడీ.  మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాల్లో సీఐడీ అధికారులు విస్తృతంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.  చిట్‌ఫండ్‌ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్‌ ఫండ్స్, షేర్‌ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లు ఆధారాలతో సహా వెల్లడైంది.   ఈ కేసులో ఇప్పటికే నలుగురు బ్రాంచ్‌ మేనేజర్లను సీఐడీ అరెస్ట్‌ చేసింది.

ఫామ్‌ 21ని కీలకం

మార్గదర్శి చిట్‌ఫండ్‌ సోదాల్లో భారీగా అక్రమాలు గుర్తించారు అధికారులు. మార్గదర్శి రికార్డులన్నీ అక్రమేనని తేల్చిన సీఐడీ.. ఆ మేరకు విచారణకు సిద్ధమైంది. బ్యాలెన్స్‌ షీట్‌ సమర్పించకపోవడంతో పాటు చిట్‌ గ్రూప్‌లకు చెందిన ఫామ్‌ 21ని కూడా మార్గదర్శి సమర్పించలేదు. మొత్తంగా ఏడు మార్గదర్శి బ్రాంచ్‌ల్లో తనిఖీలు చేసి వాటిలో అక్రమాలు గుర్తించారు సీఐడీ అధికారులు. దీనిలో భాగంగానే రామోజీరావు, శైలజాకిరణ్‌లను విచారించడానికి సిద్ధమైంది. ఈ మేరకు రామోజీరావు, శైలజాకిరణ్‌లకు నోటీసులు ఇచ్చిన సీఐడీ.. నేడు విచారణ చేపట్టింది.

ఇవే సెక్షన్లు

ఐపీసీ సెక్షన్లు 420, 409, 120 బి, 477 రెడ్‌విత్‌ 34, కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టం–1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసులో సీఐడీ అధికారులు నలుగురు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మేనేజర్లను అరెస్టు చేశారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »