ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐకి చుక్కెదురు
జులై 31కి విచారణ వాయిదా..
ఢిల్లీ , మార్చి 13 : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐకి చుక్కెదురు ఎదురైంది. సీబీఐ విచారణపై సుప్రీం కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. తదుపరి విచారణ తేదీ వరకు స్టేటస్ కో కొనసాగుతుందని స్పష్టీకరణ. ఎలాంటి పేపర్లు, డాకుమెంట్స్ సీబీఐకి ఇవ్వద్దన్న సుప్రీంకోర్టు ఆదేశం.
పిటిషన్ ను విచారించిన జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సుందరీశ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇప్పుడు విచారణ కొనసాగించవద్దన్న సుప్రీంకోర్టు. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం… విషయం మా వద్ద ఉన్నప్పుడు విచారణ కొనసాగించవద్దన్న సర్వోన్నత న్యాయస్థానం. లేకుంటే మేము మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుందని హెచ్చరిక చేసింది. తదుపరి విచారణ జులై 31కి విచారణ వాయిదా.