హెబియస్ కార్పస్ పిటిషన్పై
పోలీసులకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, ఏప్రిల్ 6 (వైడ్ న్యూస్) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ బీజేపీ హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ఇవాళ విచారణకి వచ్చింది. బండి సంజయ్ తరుపున వాదించిన న్యాయవాది పోలీసులు ఆయనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.