పోలీసుల సమయంలో దాడి చేసినా
నివారించలేని పోలీసులు
హనుమకొండ: హనుమకొండ గోపాల్ పూర్ లో నాస్తికుడు బైరి నరేష్ పై అయ్యప్ప భక్తుల దాడి చేశారు. పోలీస్ వెహికిల్ లో ప్రొటెక్షన్ తో వెళ్తున్న నరేష్ ని కిందకు లాగి దేహశుద్ధి చేశారు వారు.
గతంలో అయ్యప్ప స్వామి పై వివాదాస్పద వ్యాక్యలు చేసిన భైరి నరేష్ జైలు కెళ్లిన విషయం విధితమే. జైలు నుండి బెయిల్ పై బయటకు వచ్చాక మరోమారు వివాస్పద వాఖ్యలు చేసారు నరేష్.
నరేష్ తీరు మార్చుకోకుండా నేనింతే అన్నట్టు వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యప్ప స్వాములు దాడి చేసి చితుక బాదారు. అయితే.. ఈ సంఘటన పోలీసుల సమక్షంలో దాడి జరుగడం విశేషం.