తుమ్మలపై హత్యాయత్నం
పోలీసులకు ఫిర్యాదు
ఖమ్మం:
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీద హత్యాయత్నం కుట్రపై తుమ్మల అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. తుమ్మల ఎన్నికల ప్రచారంలో హతమార్చెందుకు కుట్ర పన్నిన వారిపై సమగ్ర విచారణ జరిపించి,దోషులను
కఠినంగా శిక్షించాలని ఖమ్మం అసిస్టెంట్ కమీషనర్ ను కలిసి ఫిర్యాదు చేసారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మిక్కిలినేని నరేందర్, పత్తి శ్రీనివాస్, చండ్ర రాంబాబు, నల్లమల ఆనంద్, నల్లమల వేణు చౌదరి, కార్యకర్తలు వున్నారు.