ఆయుర్వేదంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
నిర్దేశం, హైదరాబాద్:
భారత హెల్త్ కేర్ రంగం అద్భుతమైన పురోగతి సాధిస్తోంది. ఆధునిక సాంకేతికకు మూలికా, ఆయుర్వేద నివారణలను మిళితం చేయడం చేయడం ద్వారా మెరుగైన చికిత్స అందించడానికి, సంప్రదాయ, ఆయుర్వేదంతో కొత్త మందులు అందించడానికి అవకాశం ఏర్పడుతోంది. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తు వేగంగా అభివృద్ది చెందుతోంది. వ్యాధి నిర్దారణ, నివారణ, ఆవిష్కరణ, పరిశోధన ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. పతంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డాబర్ ఇండియా లిమిటెడ్ తో పాటు సన్ హెర్బల్స్ వంటి దేశంలోని అనేక కంపెనీలు, సంస్థలు ఆయుర్వేద మందుల కోసం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ మందుల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ , డిజిటల్ హెల్త్ మిషన్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ సేవలకు అవకాశాలను పెంచాయి. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తు ఆవిష్కరణ, పరిశోధన ద్వారా వేగంగా మారుతోంది. దేశంలోని టెలిమెడిసిన్, ఇ-సంజీవని వంటి వేదికలు మారుమూల రోగులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నాయి. వారి ఆరోగ్యాలను కాపాడుతున్నాయి. సాంకేతిక అభివృద్ధి, కృత్రిమ మేధస్సు, బయోటెక్నాలజీ, డిజిటల్ ఆరోగ్య పరిష్కారాల ద్వారా, దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సామాన్య ప్రజలకూ అందుబాటులోకి వస్తోంది.