అంబర్పేట సీఐ సుధాకర్ అరెస్ట్
ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలో…
దొంగలు.. దొంగలు ఊళ్లు పంచుకునే సామెత గుర్తుకు వస్తోంది.
కష్టాలు వచ్చినా.. బాధలు వచ్చినా ముందుగా చెప్పు కోవాల్సింది పోలీసులకే..
మరీ.. ఆ పోలీసు అధికారులే తప్పులు చేస్తే.. నిజమే..
ఇగో.. ఈ పోలీసు అధికారి తప్పు చేసి జైల్ లో చిప్ప కూడు తింటున్నాడు.
హైదరాబాద్లోని అంబర్పేట పోలీసు స్టేషన్ సీఐ సుధాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. భూమి వ్యవహారంలో ఓ వ్యక్తిని మోసగించినట్లు సీఐ సుధాకర్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విచారణ అనంతరం సుధాకర్ను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు.
కందుకూరు మండల పరిధిలో ఓ భూమిని రూ. 54 లక్షలకు ఇప్పిస్తానని సుధాకర్.. ఓ ఎన్ఆర్ఐకి చెప్పాడు. దీంతో అతను సుధాకర్ను నమ్మి పలు దఫాల్లో రూ. 54 లక్షలు ఇచ్చాడు. ఇక ఆర్ఐగా విధులు నిర్వర్తిస్తూ సస్పెండ్కు గురైన రాజేశ్ను ఎమ్మార్వోగా ఎన్ఆర్ఐకి పరిచయం చేశాడు సుధాకర్. రాజేశే భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తారని నమ్మబలికాడు. మొత్తం డబ్బులు చెల్లించినప్పటికీ, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఎన్ఆర్ఐ తాను మోసపోయానని గ్రహించి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగదు, భూమికి సంబంధించిన వివరాలన్నింటినీ ఎన్ఆర్ఐ పోలీసులకు సమర్పించారు. ఆ వివరాలన్నీ పక్కాగా ఉండటంతో సుధాకర్, రాజేశ్ను పోలీసులు అరెస్టు చేశారు. కాసేపట్లో సుధాకర్ను రిమాండ్కు తరలించనున్నారు.