అయ్యో పాపం
పదవ తరగతి విద్యార్థిని మృతి
నిర్దేశం, కామారెడ్డి :
అయ్యో పాపం.. పదవతరగతి చదువుతున్న శ్రీనిధి గుండెపోటుతో మరణించడం బాధనే.. కానీ.. జీవితాలు గాలిలో కలిసి పోతుంటే ఎప్పుడు ఎవరికి ఏమి అవుతుందో తెలియని పరిస్థితి. ఇగో.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన శ్రీనిధి (14) ఓ ప్రైవేట్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే ఉదయం పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది ఆ విద్యార్థిని..ఆమెను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందడం బాధగా ఉందంటున్నారు ఆ సీన్ చూసిన ప్రజలు.. ఇంత చిన్న వయసులో శ్రీనిధి గుండె పోటుతో మరణించడం ఏమిటంటున్నారు వారు.. నిజంగా బాధకరమైన ఈ వార్తలను రాయాలంటే మాకు బాధగానే ఉంది..