మాతృమూర్తి మరణంతో బాధతో ఎన్నికల నుంచి తప్పుకున్న తనయుడు

మాతృమూర్తి మరణంతో

శివసేన అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా..

నిర్దేశం, సికింద్రాబాద్ :

లక్ష్మణ్ కాక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయలనుకున్నాడు. శివసేన మద్దతుతో ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా సాటాలనుకున్నాడు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి మద్దతుదారులతో పోటీ చేయడానికి నామినేషన్ కూడా వేసాడు. కానీ.. విధి వక్రికరించింది. అతని మాతృమూర్తి భారతి బాయ్ మరణించారు. అంతే.. లక్ష్మన్ కాక బాధ వర్ణతీతం. మాతృమూర్తి పరలోకానికి వెళ్లడంతో మనస్థాపానికి గురైన అతను తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు.

కార్యకర్తలతో మాట్లాడి..

శివసేన తెలంగాణ పార్టీ ఆదేశాల మేరకు కార్యకర్తలతో చర్చించి అసెంబ్లీ ఎన్నికలలో ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటాను అంటున్నారు లక్ష్మన్ కాక. మొదటి నుంచి తనతో ఉన్న క్రీయశీల కార్యకర్తలైన హీరాలాల్ ,సిద్దు , కాళిదాస్, విశాల్, షిండే, మహేష్ తదితరులతో మాట్లాడుతానన్నారు ఆయన.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »