పోలీసులకు ఆదివాసీలకు నడుమ వాగ్వాదం

అర్ధరాత్రి ఆదివాసీల ఆందోళన

– పోలీసులకు ఆదివాసీలకు నడుమ వాగ్వాదం

భద్రాచలం : భద్రాచలం శివారు ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఆదివాసీలకు పోలీసులకు నడుమ వాగ్వాదం చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. కొద్ది రోజులుగా క్రితం భద్రాచలం శివారు ప్రాంతాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు ఖాళీ ప్రదేశాల్లో గుడిసెలు వేసుకొని , ఇండ్ల జాగాకు హక్కు పత్రాలు ఇప్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ స్థలాలకు సంబంధించిన యజమానులు హైకోర్టు నుంచి తమకు అనుకూలంగా ఉత్తర్వులు తీసుకుని రావడంతో పోలీసులు గురువారం ఉదయం ఆ స్థలాల్లో ఉన్న గుడిసెలను తొలగించి హైకోర్టు ఆదేశాలు సహకరించాలని కోరారు.

ఉన్నట్లుండి శుక్రవారం అర్ధరాత్రి ఆ ఖాళీ ప్రదేశంలోని ఓ గుడిసె మంటలకు గురైంది .దీంతో ఆదివాసులు పోలీసులే గుడిసెకు మంటలంటిచ్చారని, ఓ వృద్ధురాలు సజీవ దహనం అయిందని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు . ఈ క్రమంలో పోలీసులకు, ఆదివాసీ లకు నడుమ గొడవ చోటు చేసుకుంది. ఆదివాసీలు అర్ధరాత్రి చీకట్లోనే బైఠాయించి ఐటీడీఏ పీవో, తాసిల్దార్ వచ్చి తమకు సమాధానం ఇవ్వాలని నినాదాలు చేశారు .

సిఐ నాగరాజు రెడ్డి ఆందోళనకారులతో మాట్లాడుతూ…చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని సహకరించాలని కోరారు .ఆందోళన విరమించి కోర్టు ద్వారా న్యాయం కోసం ప్రయతించాలని సర్ది చెప్పారు. అయినా ఆదివాసీలు శాంతించలేదు. అంతా చీకటిగా ఉండటంతో ఎం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అక్కడ నెలకొంది. ప్రస్తుతానికి ఆందోళన కొనసాగుతూనే ఉంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!