భార్య గొంతు కోసి హత్య చేసిన కానిస్టేబుల్
హైదరాబాద్, మే 11 : వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమి నగర్ లో దారుణం జరిగింది. కష్ట సుఖాలలో కలిసి ఉండాల్సిన భర్త భార్యని దారుణంగా చేయి, గొంతుని కోసి హత్య చేసాడు హై కోర్టు కానిస్టేబుల్ కుంచపు రాజ్ కుమార్. కట్టుకున్న భార్య శోబా ను మొదట చేయి కోసిన భర్త, రక్షించండి అని అరుస్తూ కిందకు మొదటి అంతస్తూ నుండి కిందకు వస్తుంటే గేటు ముందట కత్తితో మెడ కోసి భర్త హత్య చేసాడని పోలీసులు తెలిపారు. భర్త హై కోర్ట్ లో 4 వగెట్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు కానిస్టేబుల్. అక్రమ సంబందం కారణంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎల్ బి నగర్ డీసీపీ సాయి శ్రీ.