అకాల వర్షాల బీభత్సం

అకాల వర్షాల బీభత్సం

వర్షంతో తడిసి ముద్దయిన ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలు

యాదాద్రి జిల్లాలో
యాదాద్రి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను కన్నీరు పెట్టిస్తున్నాయి. చౌటుప్పల్ మార్కెట్ యార్డులో రైతులు కళ్లముందు తమ ధాన్యం తడిసి ముద్దవుతుంటే నిస్సహాయంగా చూస్తున్నారు. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో ఒక్కసారిగా విరుచుకుపడిన వర్షం వారి ఆశలను నీరుగార్చింది.
అష్ట కష్టాలు  పడి పండించిన పంటను అమ్ముకుందామనుకున్న సమయంలో ఈ అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఐకేపీ, పీఏసిఎస్  సెంటర్ లు,మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం కుప్పలపై కప్పిన పట్టాలు బలమైన గాలులకు ఎగిరిపోయాయి. దీంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు నష్టం వాటిల్లకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు
17 శాతం తేమ ఉండేలా వారం రోజుల నుండి కష్టపడి ఎండ పెడితే అకాల వర్షం రైతులను నిండా ముంచింది.. ఈదురు గాలులు,ఉరుములు మెరుపులు లతో వర్షం బీబత్సం సృష్టిస్తుంది..ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లైట్లు లేక, గాలికి పట్టాలు కొట్టుకు పోయి, కారు చీకట్లో పాములు, తేల్లు వర్షపు నీటిలో కొట్టుకు ని ధాన్యం రాసుల్లోకి వస్తున్నా తడిసిన ధాన్యం కల్లా ల లో మహిళా రైతులు సహితం  తడిసిన బట్టలతో ప్రాణాలు అరి చేతిలో పెట్టికుని తమ ధాన్యం తడిసి పోతుందనే బాధతోనే ఐకేపి, పిఎసి ఎస్ కేంద్రాల్లోనే బిక్కు బిక్కుమనుకుంటూ అక్కడే ఉన్నారు.. ఎవరికి చెప్పుకోవాలో కుడా తెలియడం లేదంటూ మనో వేదన పడుతున్నారు….

సిద్ధిపేట జిల్లాలో
సిద్ధిపేట జిల్లా  చేర్యాల, కొమురవెళ్లి మండలల్లోని పలు గ్రామాల్లో  కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసిముద్దవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకపోవడంతో అకాల వర్షానికి ఆరబోసిన ధాన్యం వర్షానికి  తడిసి కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..గన్ని సంచులు,టార్ఫ్లిన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో అద్దెకు తెచ్చుకున్నామని రైతులు తెలిపారు.. మరో రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు అవుతున్నదన్న తరుణంలో అకాల వర్షం కురిసి నష్టం వాటిల్లిందని రైతులు వాపోయార.. అలాగే కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని  ప్రభుత్వన్ని కోరుతున్నారు..

కోరుట్లలో గాలి వాన బీభత్సం, నేలకొరిగిన పంటల, రాలిపోయిన మామిడికాయలు
పలు చోట్ల తెగిపడిన విద్యుత్ తీగలు

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో గాలివాన భీభత్సం సృష్టించింది. గాలితో భారీ వర్షం కురియడంతో చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరగాయి. పంటలు దెబ్బతిన్నాయి. మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో నష్టం ఎక్కువగా వాటిల్లింది. వరి, నువ్వుల పంట నేలకొరిగింది. మామిడికాయలు రాలిపోయాయి.  ఇబ్రహీంపట్నం మండలం గోదూర్ శివారులో రోడ్డుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.  విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పవర్ సప్లై నిలిచిపోయింది. మెట్ పల్లి లో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్థంభాలు పడిపోయాయి. విద్యుత్ సప్లై నిలిచిపోయింది.
భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చేతికందే దశలో ఉన్న పంటలు దెబ్బ తినడంతో అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »