ప్రాణాలు తీసుకోవద్దమ్మ…
– విద్యార్థిని ఆత్మహత్య
నిర్దేశం, మంచిర్యాల :
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్ పల్లి గ్రామానికి చెందిన హాసిని (18) చెన్నూరులోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదువుతుంది. అయితే.. చదువు ఇష్టం లేక ఇంటికి రావడంతో విద్యార్థిని తండ్రి ఆమెను బలవంతంగా మంచిర్యాలలోని ప్రైవేట్ కళాశాలలో చేర్పించాడు. అయితే ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతుండడంతో, ఫెయిల్ అవుతానని భయపడ్డ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.