వేల కోట్ల రూపాయలను విదేశాలకు తరలుతున్నాయి
హైదరాబాద్, నిర్దేశం:
దుబాయ్ లో కేదార్ మృతి రాష్ట్రంలో సంచలనంగా మారిందని ద మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేదార్ జూబ్లీ హిల్స్ లో గతంలో పబ్ లను నడిపిన వ్యక్తి. గతంలో డ్రగ్స్ కేసులో దొరికిండు. ఆయన తో పాటు డ్రగ్స్ లో ఉన్న వ్యక్తులు ఎవరో తెలియాలని అయన అన్నారు. తెలంగాణ లో సంపాదించిన అక్రమ సంపాదన వేల కోట్లు దుబాయ్ తరలించారు. అక్రమ డబ్బులు ఎవరు దుబాయ్ కి తరలించారో ప్రజలకు తెలియాలి. కేంద్ర,రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. గత ప్రభుత్వంలో ఉన్న బినామిలు ఇప్పుడు ఎక్కడికి పోయారో తెలియాలి. వెలకోట్లు విదేశాలకు తరలిపోతుంటే రాష్ట్రంలో విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 14నెలలు అవుతున్నా విచారణ సంస్థలు ఇప్పటి వరకు ఒక్క హవాలా వ్యక్తి ని కూడా పట్టుకోలేదు.డ్రగ్స్ దందాలో సినీ ప్రముఖుల ప్రమేయం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైన హవాలా దందా పై యాక్షన్ తీసుకోకపోతే భవిషత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు.
సినీ ప్రముఖులకు విజ్ఞప్తి
సినీ ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్ పేరుతో సంపాదించిన సొమ్ము విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నారు. చీటర్స్ చేతిలో సూపర్ స్టార్స్ మోసపోతున్నారు. సంపాదించిన సొమ్ముతో కొంత తెలంగాణ కు కేటాయించాలని కోరుతున్న. తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. మీ సంపాదనలో కొంత తెలంగాణ విద్యానిది కి కేటాయించండి. తెలంగాణ పిల్లల భవిషత్తు ను అందంగా తీర్చి దిద్దాడానికి సహకరించండి. ఇప్పటికైన యాక్షన్ తీసుకోకపోతే భవిషత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు.