దొంగలను ఎదిరించిన తల్లీ కూతుళ్లను సన్మానించిన డీసీపీ
సికింద్రాబాద్
ఇంట్లోకి చొరబడ్డ దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించిన తల్లీ కూతుళ్ళను నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని సనర్మానించారు.
డీపీసీ మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం పైగా కాలనీలో అటెంప్ట్ రాబరీ జరిగిందని, నిందితులు మర్డర్ చేయడానికి ప్రయత్నించారన్నారు. నిందితులు 2022 లో దీపావళి టైంలో వీరి ఇంట్లో పని చేయడానికి వచ్చారని, నాలుగు రోజుల పాటు పని చేశారన్నారు. రాబరీ చేయడానికి ఇద్దరు నిందితులు ప్లాన్ చేసుకొని వచ్చారని, రెండు రోజుల ముందు రెక్కీ చేశారన్నారు.
కొరియర్ వచ్చిందని చెప్పి ఇంట్లోకి వచ్చారని, కంట్రీ మేడ్ వెపన్, కత్తి తో బెదిరించారన్నారు. నిందితులను పట్టుకోవడానికి తల్లీ కూతుళ్లు ధైర్యసాహసాలు చూపించారని, నా పదకొండేళ్ల సర్వీస్ లో ఇంత ధైర్యసాహసాలు చూపించిన మహిళలను చూడలేదన్నారు. ఒక నిందితుడిని ఇక్కడే పట్టుకున్నారని, మరో నిందితుడిని కాజీపేట లో జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారన్నారు. వెపన్ ఎక్కడి నుండి తెచ్చారు, గతంలో కేసులు ఏమైనా ఉన్నాయా అని ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని, మహిళలు కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని అన్నారు.