కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు

కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు

కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు కొత్త కమిషనర్లను నియమించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సింగ్ సంధు, జ్ఞనేశ్‌కుమార్‌ లను నియమించారు.

ఈ మేరకు సెలక్షన్ కమిటీ సంబంధించి ఎంపిక ప్రక్రి యను చేపట్టింది. కాగా ఫిబ్రవరి నెలలో ఎన్నికల కమిషనర్‌ అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, ఇటీవల అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అరుణ్ కుమార్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదించారు.దీంతో రెండు ఎన్నికల కమిషనర్‌ పోస్టులు ఖాళీ అయ్యాయి.

తాజాగా ఆ పదవులనే భర్తీ చేశారు. దేశంలో మరికొద్ది రోజుల్లోనే లోక్‌సభ ఎన్ని కలు జరగాల్సి ఉంది. సాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘంకు సంబంధించి ముగ్గురు సభ్యుల కమిషన్ ప్యానెల్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు కమిషనర్‌లు ఉంటారు.

రెండు కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో వెంటనే వాటిని భర్తీచేయాల్సి వచ్చింది. సుఖ్‌బీర్‌ సింగ్ సంధు, జ్ఞనేశ్‌ కుమార్‌లను కేంద్ర ఎన్నికల కమిషనర్లగా నియామకం అయ్యారు

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!