ఓటరు ముసాయిదా జాబితా విడుదల
రాష్ట్రంలో ఓటర్లు 3.06 కోట్ల మంది
హైదరాబాద్, ఆగష్టు 21 : తెలంగాణ ఓటరు జాబితా ముసాయిదాను ఈసీ విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3.06 కోట్ల మంది ఉండగా, పురుషులు 1.53 కోట్లు, మహిళలు 1.52 కోట్ల మంది ఉన్నారు. వీరిలో 18-19 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్లు 4.76 లక్షలు కాగా, ట్రాన్స్ జెండర్లు 2,133, ఎన్ఆర్ఐ 2,742, సర్వీసు ఓటర్లు 15,337 మంది ఉన్నారు.
వచ్చేనెల 19 లోపు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనుండగా అక్టోబర్ 4 న తుది జాబితాను ఈసీ ప్రకటించనుంది.
హైదరాబాద్ ఓటరు ముసాయిదా జాబితా విడుదల
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 43 లక్షల 989 మంది ఓటర్లు. పురుషులు 22 లక్షల 9వేల 972, మహిళలు 20 లక్షల 90 వేల 727, ట్రాన్స్ జెండర్లు 290.అత్యధికంగా జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో 3 లక్షల 56 వేల 995, అత్యల్పంగా చార్మినార్ లో 2 లక్షల 16 వేల 648 మంది ఓటర్లు. హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ కేంద్రాలు 3986. అక్టోబర్ నాలుగో తేదీన తుది జాబితా ప్రచురణ.