నాగర్ కర్నూల్ లో బిఎస్ పి పాదయాత్ర

బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ పాదయాత్ర

నాగర్ కర్నూల్, మార్చి 22 : బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడతలో భాగంగా 203వ రోజు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని తిమ్మాజిపేట మండలంలో కొనసాగింది. అందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన పత్రికా సమావేశంలో బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. అమరవీరులకు నివాళులు… కొందరి తెలంగాణ అందరి తెలంగాణగా చేయడం కోసం జరుగుతున్న యుద్ధం జరుగుతుందన్నారు ఆయన.

బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 1400 గ్రామాలు తిరిగిన ఎక్కడికి వెళ్లినా తల్లిదండ్రులు ఉద్యోగాలు అడుగుతున్నారన్నారుఆయన. విద్యార్థులంతా బియ్యం సంచులు తెచ్చుకుని హైదరాబాద్ లో అగ్గిపెట్టెల వంటి రూంలలో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రవీణ్ కుమార్. రోజు 18 గంటల పాటు నిరుద్యోగ యువత జాబ్ కోసం కష్టపడి చదువుతున్నారన్నారు.

2014,2018 లో అధికారం ఇచ్చి గెలిపిస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రజలను, నిరుద్యోగులను నిండా ముంచిందన్నారు ప్రవీణ్ కుమార్. గ్రూప్ 1 వెయ్యి హత్యల కుంటే తీవ్రమైనదన్నారు ఆయన.
ఈ గ్రూప్ 1 ద్వారా ఉద్యోగం పొందిన వారు రేపు సెక్రటరీలు,పెద్ద అధికారులు అవుతారు. ఇలాంటి అధికారులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే రక్షణను ప్రమాదంలో పడేస్తదన్నారు ఆయన. అయినా తాను ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ప్రభుత్వం తలొగ్గి గ్రూప్ 1 రద్దు చేసిందన్నారు ఆయన.  సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తే పట్టించుకోలేదన్నారు ప్రవీణ్ కుమార్ .

డాక్టర్ ప్రవీణ్ కుమార్ .పాదయాత్ర సందర్భంగా గ్రామీణులతో ముచ్చటించారు. అతనితో పెద్ద ఎత్తున యువత పాదయాత్ర చేశారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »