తెలుగుదేశం పార్టీ 40 వ వసంతం


AP 39TV 29మార్చ్ 2021:

తెలుగుదేశం పార్టీ 39 వసంతాలు పూర్తి చేసుకొని 40 వ వసంతం లోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మహానేత,స్వర్గీయ నందమూరి తారకరామారావు ని స్మరిస్తూ స్ధానిక అనంతపురం లోని జిల్లా పరిషత్ కార్యాలయం నందు అన్న విగ్రహానికి గజమాల సమర్పించి ఘన నివాళులు అర్పించారు.అలాగే అనంతపురం పార్లమెంట్ ఇంఛార్జి జేసీ పవన్ రెడ్డి  కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరియు ముఖ్యంగా సీనియర్ కార్యకర్త బుల్లె రామకృష్ణ కు సన్మానం చేసి పార్టీ కి మీ లాంటి కార్యకర్తలే పట్టు కొమ్మలు అంటూ కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బుగ్గయ్య చౌదరి ,బొమ్మగౌని కిరణ్ కుమార్ గౌడ్,మాజి టౌన్ ప్రెసిడెంట్, కృష్ణ కుమార్,కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్ మురళి,సీనియర్ నాయకుడు మణికంఠ బాబు, డిష్ ప్రకాష్, చెక్కా నాగేంద్ర, NBK శ్రీధర్, భూమా బాల సుబ్రహ్మణ్యం,రియాజ్, గోపాల్, జాఫర్, రుద్రంపేట నాయకులు నాగభూషణం, జయరామ్ నాయక్, ఆది, రాజీవ్ కాలనీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, జీలాన్, చెన్నకేశవులు, నూర్,గణేష్,రాజు, వెంకట నారాయణ, మదన్ మోహన్, సత్య నారాయణ, నంబూరి రమణ,వడ్డే వెంకటేసులు,దొండ్లగు మోహన్ కుమార్, జెన్నే మురళి,TNSF నాయకులు గుత్తా ధను, చక్రయా పేట సురేష్, వీర, మహిళ కార్యకర్తలు నాయుడమ్మ, నూర్జహాన్ ,రమాదేవి, శారదా, సరిత, వడ్డే భవాని, ప్రమీలమ్మ,  టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *