Take a fresh look at your lifestyle.

తెలంగాణలో హత్ సే హాధ్ జోడో అభియాన్ షురూ

0 84

తెలంగాణ రాష్ట్రంలో హాత్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్ర లు సోమవారం ప్రారంభం అయ్యాయి. మేడారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు పాదయాత్రలో.పాన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మానక్ రావు ఠాక్రే మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో చేసిన ప్రధాన ప్రసంగాలను బీజేపీ 8 ఏళ్లలో దేశంలో చేసిన ప్రజా వ్యతిరేకత కార్యక్రమాలను ఛార్జ్ షీట్ రూపంలో జనంలోకి తీస్కెల్లుతాం. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అవినీతి, అక్రమాలు ప్రజా వ్యతిరేక పనులపై ఛార్జ్ షీట్ విడుదల చేసాము.. ఇవన్నీ జనం.లోకి తీస్కెల్లుతామని అన్నారు.
పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న దృశ్యా ఆయా సభ్యులు ఇప్పుడు పాదయాత్ర లో వెసులుబాటు తీస్కొని పాల్గొంటారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటున్నందున పార్లమెంట్ లో పాల్గొనే అవకాశం లేదు. అందరూ నాయకులు వారి వారి నియోజక వర్గాల్లో పాదయాత్రలు చేస్తారు. వారి వారి అవకాశాలను బట్టి ఇతర ప్రాంతాలలో కూడా పాల్గొంటారు. పాదయాత్రలో జనంతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటారు.. ప్రతి ఇంటికి హాత్ సే హాత్ జోడో పోస్టర్ ను అంటింటి ఈ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించడానికి కాంగ్రెస్ తో చేయి కలపాలని కోరుతున్నాం. పాదయాత్ర పెద్ద ఎత్తున విజయవంతం అవుతుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking