పిటీషనర్ కు కోటి జరిమానా.. తెలంగాణ హైకోర్టు సంచలనం

పిటీషనర్ కు కోటి జరిమానా

హైదరాబాద్, నిర్దేశం:

తెలంగాణ హైకోర్టు ఓ పిటిషన్ విషయంలో సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టును తప్పుదోవ పట్టిస్తావా అంటూ పిటిషనర్ కు ఏకంగా రూ.1 కోటి జరిమానా విధించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భీమపాక నగేశ్‌ మంగళవారం నాడు సంచలన తీర్పు వెలువరించారు. ఉరాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టునే తప్పుదోవ పట్టిస్తారా అంటూ పిటిషనర్‌కు కోటి రూపాయల జరిమానా విధించారు. హైకోర్టులో ఓ కేసు పెండింగ్‌లో ఉంది. ఆ విషయాన్ని దాచిన పిటిషనర్ వేరే బెంచ్‌ వద్ద పిటిషన్‌ వేసి ఆర్డర్‌ తీసుకున్నారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి నగేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా రిట్ పిటిషన్లు వేయటంపై ఆయన సీరియస్‌ అయ్యారు. అక్రమ మార్గాలలో విలువైన ప్రభుత్వ భూములను సొంతం చేసుకోవాలని పిటిషనర్ యత్నించినట్లు గుర్తించారు. కోర్టులను మభ్యపెట్టాలని ప్రయత్నించడం, కోర్టుల సమయాన్ని వృథా చేయడంతో పాటు తప్పుదోవ పట్టించేయత్నం చేసినందుకు పిటిషనర్ కు కోటి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. అత్యంత భారీ జరిమానా విధిస్తూ తీర్పు రావడం తెలంగాణలో హాట్ టాపిక్ అవుతోంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »